| Daily భారత్
Logo




సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

News

Posted on 2026-07-29 16:08:30

Share: Share


సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

వైద్యాధికారుల జూమ్ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల పర్యవేక్షణపై జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ వైద్యాధికారులతో జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు (CHCలు), ఏరియా ఆసుపత్రులు (AHలు), టీచింగ్ ఆసుపత్రులు (THలు), జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు (GGHలు), వైద్య కళాశాలలు, ప్రైవేట్ హాస్పిటళ్లు మరియు ప్రైవేట్ క్లినిక్‌లు తప్పనిసరిగా మూడు అంశాలను అమలు చేయాలని సూచించారు.

ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో కుక్క కాటు (Anti Rabies Vaccine) మందులు అందుబాటులో ఉంచాలి.

ప్రతి ఆసుపత్రిలో కుక్క కాటు కేసుల పర్యవేక్షణ కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలి.

ఈ వివరాలను ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా నోటీసు బోర్డుపై ప్రదర్శించాలి.

అదేవిధంగా, వైద్యాధికారులు తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లను రెండు వారాలకి ఒకసారి  తప్పనిసరిగా తనిఖీ చేసి విద్యార్థులకు వైద్య శిబిరాలు నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేయాలని, హాస్టల్ సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. హాస్టల్లో వంట చేసే వారికి తప్పనిసరిగా జుట్టు చేతి గోర్లు కత్తిరించుకోవాలని తెలియజేశారు

గ్రామీణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి జ్వరం, విరేచనాలు, వాంతులు, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వెంటనే సంబంధిత వైద్యాధికారికి సమాచారం అందించాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి చికిత్స అందించాలని సూచించారు.

ప్రతి మంగళవారం, శుక్రవారం యాక్షన్ ప్లాన్ ప్రకారం నిర్వహించే కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి వారాంత నివేదికలను సూపర్వైజర్లు, వైద్యాధికారులకు సమర్పించాలని తెలిపారు. ఆ నివేదికల ఆధారంగా వ్యాధులు అధికంగా నమోదవుతున్న గ్రామాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రోగ్రాం అధికారులు తమ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, ఎన్సీడీ స్క్రీనింగ్, శ్రమదానం, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (PMSMA), ఆరోగ్య మహిళ, సికిల్ సెల్ స్క్రీనింగ్, టీబీ అనుమానితుల గుర్తింపు, రోగులకు మందుల పంపిణీ, వైద్య శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.

ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలు, సూచనలు అందిస్తూ నిరంతర సమీక్షలు నిర్వహించాలని తెలిపారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని డాక్టర్ తుకారం రాథోడ్ సూచించారు.

విధుల పట్ల నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించిన సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >
Image 1

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:14:43

Readmore >
Image 1

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:08:30

Readmore >
Image 1

నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో అశ్వాపురంలో విస్తృత తనిఖీలు

Posted On 2026-07-29 16:07:12

Readmore >
Image 1

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్

Posted On 2026-07-29 08:54:06

Readmore >
Image 1

చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ

Posted On 2026-07-29 08:52:51

Readmore >
Image 1

మహిళా లెక్చరర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

Posted On 2026-07-29 08:51:28

Readmore >