Posted on 2025-12-09 15:35:00
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రోడ్డుపై ప్రమాదకరమైన గుంత ఏర్పడి తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పాలకులు పట్టించుకోకపోవడంతో యువకులు మానవత్వంతో ముందుకు వచ్చారు. మాజీ మంత్రి, ప్రస్తుతం ఇటీవలే ప్రభుత్వ సలహాదారునిగా నియామకమైన సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలోనే ఈ సంఘటన వెలుగు చూడడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.
బాసర నుండి నవీపేట్ ప్రధాన రహదారి మూలమలుపు వద్ద రోడ్డుమీద ఒక గుంత ఏర్పడి నెలలు గడుస్తున్న ఎవరూ పట్టించుకోలేదు. పాలకుల నిర్లక్ష్యంతో ఆ గుంత మరింత ప్రమాదకరంగా మారింది. శివ తాండకు చెందిన భానోత్ మోహన్ ఆ గుంతలో పడగా అతని కాలు ఫ్రాక్చర్ అయింది. అయితే రోడ్డు మీద ఎంతోమంది ప్రయాణం చేస్తుంటారు. కానీ ఆ గుంత గురించి ఎవరు పట్టించుకోకపోవడంతో నవీపేట్ మండలం శివతాండకు చెందిన యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తాండకు చెందిన ప్రతి యువకుడు పైసా పైసా జమచేసి గుంతను పూడ్చడంతో తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా గుంతను పూడ్చిన వారిలో శివతాండ యువకులు భాను,జీవన్ నాయక్, ప్రేమ్ సింగ్, మహేష్, తిరుపతి, ఉదయ్ లతో సహా ఇతర మిత్ర బృంద సహచరులు తదితరులు ఉన్నారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >