Posted on 2025-12-09 18:50:09
అభివృద్ధికి సంక్షేమానికి BRS పెద్దపీట
గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాపు సీతాలక్ష్మి
డైలీ భారత్ న్యూ,స్ భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. మంగళవారం చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు గెలుపు కోసం మేషన్ కాలనీ, ఎస్సీబీ నగర్ ప్రాంత ఓటర్లను అభ్యర్థించారు. తొలి తెలంగాణ సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కేసీఆర్ హయాంలో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడ మైదానాలు, పల్లె దవాఖాన, వైకుంఠధామం, స్వచ్ఛ ట్రాక్టర్ ఏర్పాటు చేశారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లద్వారా తాగునీరు అందించారని తెలిపారు. రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2 వేలకు పెంచిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి, బిడ్డ పుడితే కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు అందించి సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్ణచందర్, మద్దెల సుధీర్, షణ్ముఖ సాయి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >