Posted on 2025-12-06 08:08:24
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: విద్యాలయ నిర్మాణానికి మేము సైతం అంటూ నాట్కో పరిశ్రమ ముందుకు వచ్చి గొప్ప ఔదార్యాన్ని చాటుకుంది. ఎమ్మెల్యే సంకల్పానికి మద్దత్తుగా భారీ విరాళాన్ని ఇచ్చింది. షాద్ నగర్ పట్టణంలో దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శుక్రవారం నాట్కో పరిశ్రమ యజమాన్యం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు రూ 50 లక్షల చెక్కును అందజేశారు. పరిశ్రమ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, మేనేజర్ సత్యనారాయణ లు ఎమ్మెల్యేకు చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా కళాశాల భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే వారికి చూపించారు.అనంతరం నాట్కో పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ ఎంతో గొప్ప ఉద్దేశంతో ఈ ప్రాంత నిరుపేద విద్యార్థులకు సకల సదుపాయాలతో నిర్మిస్తున్న కళాశాల భవన నిర్మాణానికి విరాళాన్ని ఇచ్చినట్టు నాట్కో పరిశ్రమ ప్రతినిధులు లక్ష్మీనారాయణ సత్యనారాయణలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అగ్గనూర్ బస్వం, చెంది తిరుపతి రెడ్డి, సాయి కృష్ణ, మహ్మద్ ఇబ్రహీం, ఇసాక్, శ్రీనివాస్ యాదవ్, రాజేందర్ రెడ్డి, ముబారక్ అలీ ఖాన్, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు
Posted On 2026-04-20 13:57:43
Readmore >
బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు
Posted On 2026-04-20 13:41:10
Readmore >