Posted on 2025-11-30 17:59:11
బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు విమర్శ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మచ్చలేని నాయకుడు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తన అనుచరులు ఇష్టానుసారంగా చేయడాన్ని బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తమ నాయకుడు ఏమాత్రం మచ్చలేని నేత ప్రశాంత్ రెడ్డి పై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జాగృతి నాయకులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడానికి వారు దుయ్యబట్టారు. ప్రశాంత్ రెడ్డి అవినీతిపై కవితకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని వారు ప్రశ్నించారు. పార్టీలో ఉన్న సమయంలో కవిత ఇసుక డంపింగ్ యార్డుల్లో, కల్లు డిపోల్లో, వాటా తీసుకోలేదా అని ఎద్దేవా చేశారు. నిజమాబాద్ నుంచి ఢిల్లీ వరకు లిక్కర్ రాణిగా పేరందిన ఆమె రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేతలకు తలోగ్గి టితలోగ్గి బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యలు చేయడానికి తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు మండిపడ్డారు. ఇకపై తమ నేతలపై తెలంగాణ జాగృతి నేతలు కల్వకుంట్ల కవిత ఇష్టం వచ్చిన విధంగా వ్యాఖ్యలు చేస్తే సరైన బుద్ధి చెప్పి తీరుతామని వారు ఘాటుగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >