Posted on 2025-11-29 13:47:54
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య పై, అలాగే పాత నేరస్థుడు రియాజ్ ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారి పిల్లలకు ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రమోద్ చిన్న కుమారుడిని,ప్రమోద్ తల్లికి అనారోగ్యానికి గురై ఉన్నారు, వారికీ సరైనటువంటి వైద్య సౌకర్యం ప్రభుతమే కల్పించాలన్నారు. పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోయిన రియాజ్ కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారుల నిర్లక్ష్యం వలనే రెండు నిండు ప్రాణాలు పోయినవని ఆయన అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నారాయణరావు, రాష్ట్ర నాయకులు వి. సంగం, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బాలయ్య, అల్గోట్ రవీందర్, నిజామాబాదు జిల్లా కార్యదర్శి జలంధర్, సీనియర్ నాయకులు, న్యాయవాదులు ఎడ్ల రాము, వీరభద్రప్ప లు పాల్గొన్నారు.
మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్మెంట్
Posted On 2026-07-31 07:06:38
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ
Posted On 2026-07-31 05:05:36
Readmore >
సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
Posted On 2026-07-31 05:03:03
Readmore >
అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్
Posted On 2026-07-31 05:01:23
Readmore >
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >