Posted on 2025-11-29 18:17:54
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య పై, అలాగే పాత నేరస్థుడు రియాజ్ ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారి పిల్లలకు ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రమోద్ చిన్న కుమారుడిని,ప్రమోద్ తల్లికి అనారోగ్యానికి గురై ఉన్నారు, వారికీ సరైనటువంటి వైద్య సౌకర్యం ప్రభుతమే కల్పించాలన్నారు. పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోయిన రియాజ్ కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారుల నిర్లక్ష్యం వలనే రెండు నిండు ప్రాణాలు పోయినవని ఆయన అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నారాయణరావు, రాష్ట్ర నాయకులు వి. సంగం, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బాలయ్య, అల్గోట్ రవీందర్, నిజామాబాదు జిల్లా కార్యదర్శి జలంధర్, సీనియర్ నాయకులు, న్యాయవాదులు ఎడ్ల రాము, వీరభద్రప్ప లు పాల్గొన్నారు.
స్వయంగా డీజిల్ పోసిన పల్నాడు కలెక్టర్... పుకార్లకు చెక్ పెట్టిన కృతిక శుక్లా!
Posted On 2026-04-27 16:39:38
Readmore >
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >