Posted on 2025-11-25 19:02:35
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రం కేజిఆర్ గార్డెన్ లో "ఇందిరా మహిళ శక్తి సంబరాలు–2025" చేవెళ్ల,శంకరపల్లి ,షాబాద్ ,మొయినాబాద్ మండలలకు చందిన 3245 మహిళా సంఘాలుకు 3 కోట్ల 69 లక్షల 21 వేలు 7 వందల 62 రూపాయిలు మహిళలకు వడ్డీ లేని రుణాలను ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళలు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు.మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల ఆర్థిక ప్రగతి కోసం ప్రభుత్వం చేపట్టిన అత్యంత ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలలో వడ్డీ లేని రుణాలు ఒకటి అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ , గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్, మార్కెట్ ఛైర్మెన్ పెంటయ్య గౌడ్, సురేందర్ రెడ్డి , మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు కోట లక్ష్మీ,మాజీ జేపీటీసీ కాలే శ్రీకాంత్ , చైర్మన్ ప్రతాప్ రెడ్డి , వెంకట్ రెడ్డి,సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి , కృష్ణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,నాలుగు మండలాల ఏపీఎంలు ,మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు, పార్టీ నాయకులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు...
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >