| Daily భారత్
Logo




సర్కారీ ఆసుపత్రులకు బండి సంజయ్ సాయం

News

Posted on 2025-11-24 13:08:19

Share: Share


సర్కారీ ఆసుపత్రులకు బండి సంజయ్ సాయం

రూ.4 కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించిన కేంద్ర మంత్రి

జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్ ఆసుపత్రులకు దాదాపు రూ.కోటి చొప్పున విలువైన వైద్య పరికరాల అందజేత

జిల్లా కలెక్టర్ తో కలిసి జమ్మికుంట, హుజూరాబాద్ ఆసుపత్రులను సందర్శించిన కేంద్ర మంత్రి

పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్న డాక్టర్లు

ఆసుపత్రికి వచ్చే రోగులపై రూపాయి భారం పడకుండా ఉచితంగా వైద్యం అందించండి

డాక్టర్లను కోరిన కేంద్ర మంత్రి బండి సంజయ్

సొంత నిధులు, సీఎస్సార్ ఫండ్స్ తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పిస్తానని  హామీ

డైలీ భారత్ న్యూస్, కరీంనగర్: ‘‘దయచేసి ఇకపై ప్రభుత్వ ఆసుపత్రులుకు వచ్చే పేద రోగులను టెస్టుల పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకు పంపొద్దు. వారిపై భారం మోపద్దు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేదే పేదలు. వారికి రూపాయి ఖర్చు లేకుండా పూర్తి చికిత్స చేసి పంపేలా చర్యలు తీసుకోండి.’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమర్ కోరారు.  ఈరోజు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి జమ్మికుంట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ ఆసుపత్రికి దాదాపు కోటి రూపాయల అత్యాధునిక వైద్య పరికరాలను సీఎస్సార్ నిధుల ద్వారా కొనుగోలు చేసి అందించారు. ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, మల్టిపురా మానిటర్, ఆటోక్లేవ్(లార్జ్), డయా థెర్మా మిషన్, అనెస్థిషియా వర్క్ స్టేషన్, ఈఎన్టీ హెడ్ లైట్, ఫెటల్ మానిటర్ సహా మొత్తం 15 వైద్య పరికరాలను అందించారు. ఆయా పరికరాల సేవలను ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ప్రారంభించారు. కాసేపట్లో హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులను కూడా సందర్శించనున్నారు.

వాస్తవానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక ద్రుష్టి సారించారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు టెన్త్ క్లాస్ చదివే దాదాపు 20 వేల మంది విద్యార్థులకు ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను అందించిన సంగతి తెలిసిందే త్వరలోనే 9వ తరగతి విద్యార్థులకు సైతం సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వ  స్కూళ్లలో 1 నుండి 6వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్, వాటర్ బాటిల్ తో కూడిన కిట్స్ ను మోదీ గిఫ్ట్ పేరుతో అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు సీఎస్సార్ నిధులతోపాటు పలువురు వ్యాపారులు, దాతల సాయంతో నిధులు సమకూరుస్తున్నారు. 

తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా బండి సంజయ్ ప్రత్యేక ద్రుష్టి సారించారు. అందులో భాగంగా జాతీయ ఖనిజాభివ్రుద్ధి సంస్థ(ఎన్ఎండీసీ) సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) రూ.4 కోట్ల నిధులను సేకరించి వేములవాడ, జమ్మికుంట, హుజూరాబాద్, హుస్నాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేసి అందించారు. వేములవాడలో రూ.1.5 కోట్ల వ్యయంతో దాదాపు 16 వైద్య పరికరాలను అందించిన బండి సంజయ్ ఇటీవల వేములవాడ పర్యటనలో భాగంగా ఆ ఆసుపత్రిని సందర్శించి ఆయా వైద్య సేవలను ప్రారంభించారు. 

తాజాగా ఈరోజు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి జమ్మికుంట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. కాసేపట్లో హుజూరాబాద్, హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి అక్కడ ఒక్కో ఆసుపత్రికి  రూ.కోటి విలువైన  అత్యాధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేసి అందించనున్నారు. ఈసీజీ మిషన్, అల్ట్రాసౌండ్ మిషన్, మల్టిపురా మానిటర్, ఆటోక్లేవ్(లార్జ్), డయా థెర్మా మిషన్, అనెస్థిషియా వర్క్ స్టేషన్, ఈఎన్టీ హెడ్ లైట్, ఫెటల్ మానిటర్ సహా మొత్తం 15 వైద్య పరికరాలు వీటిలో ఉన్నాయి. ఆయా పరికరాల సేవలను కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించనున్నారు.

గతంలో కరీంనగర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి సైతం తన బర్త్ డే కానుకగా దాదాపు రూ.3 కోట్ల విలువైన అంబులెన్సులు, ఎక్స్ రే మిషన్ సహా అత్యాధునిక వైద్య పరికరాలను బండి సంజయ్ అందించిన విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో తన సొంత ఖర్చుతో వాటికి అయ్యే మెయింటెనెన్స్ ఛార్జీలను కూడా బండి సంజయ్ చెల్లిస్తుండటం గమనార్హం.

Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >