Posted on 2025-11-23 13:58:54
సరైన శిక్షణ ఇస్తే సాధారణ మనుషులకంటేఎక్కువగా ప్రయోజకులవుతారు
స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అందుల వసతి గృహం ప్రారంభోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పుట్టడంతోనే అంధులుగా విధి వక్రీకరించి జన్మించిన వారిని చూసి సమాజం చులకన భావంతో చూస్తారని మొదటగా అందుల పట్ల ఆ భావాన్ని తీసివేస్తే వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయవచ్చు అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం నగర శివారులోని ముబారక్ నగర్ పరిధిలోని తారకరామా నగర్ కాలనీలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రత్యేకంగా అంధ విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని ఆదివారం అర్బన్ ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, సొసైటీ కార్యదర్శి సిద్దయ్యలు నూతన హాస్టల్ వసతి గృహప్రవేశం సందర్భంగా యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మానసిక దివ్యంగా అంద విద్యార్థులకు ప్రత్యేక విద్యను అందిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తున్న సిద్దయ్య వారి సిబ్బందికి అభినందనలు తెలిపారు. మానసిక దివ్యాంగ, అంత విద్యార్థుల పట్ల ఎవరు కూడా హేళన చేయకూడదని అవసరమైతే, కుదిరితే వారికి ప్రేమను పెంచాలే తప్ప వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవొద్దని ఆయన కోరారు. ఎమ్మెల్యేగా తన వంతు మానసిక దివ్యంగా విద్యార్థులకు స్నేహ సొసైటీ లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక నిధులు తీసుకురావడమే కాకుండా, తమ సొంత ట్రస్టు ద్వారా ఏదైనా సాయం కోరితే తప్పకుండా నెరవేరుస్తానని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >