Posted on 2025-11-23 21:02:35
మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని రాష్ట్ర ఐటిచ, పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇంచార్జీ మంత్రి దుద్దీళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు,మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి , షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిధులుగా పాల్గొని చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా "మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి"ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పేరిట చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని, మహిళా సంఘాల సభ్యులకు, అలాగే 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, పట్టణాల్లో 35 లక్షల చీరల చొప్పున మొత్తం దాదాపు కోటి చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్నం బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. స్వంత ఇంటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, జిల్లాలో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగాలని మహిళలు అన్ని రంగాలలో ముందుండాలనే ఉద్దేశంతో సోలార్ పవర్ ప్లాంట్ లు, ఆర్టీసీ బస్సుల కేటాయింపు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ లో భాగస్వామ్యం చేస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ లు మల్ రెడ్డి రాంరెడ్డి, చల్లా నర్సింహా రెడ్డి, కోదండరెడ్డి,అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పీడీ శ్రీలత, షాబాద్ మండలం మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోట లక్ష్మీ ,జిల్లాకు సంబందించిన ఐకేపీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >