| Daily భారత్
Logo




మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

News

Posted on 2025-11-23 16:32:35

Share: Share


మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలుపుతామని రాష్ట్ర ఐటిచ, పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇంచార్జీ మంత్రి దుద్దీళ్ళ శ్రీధర్ బాబు  అన్నారు. ఆదివారం జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు,మండలి చీఫ్ విప్  పట్నం మహేందర్ రెడ్డి ,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి , షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిధులుగా పాల్గొని  చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా "మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి"ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం పేరిట చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని, మహిళా సంఘాల సభ్యులకు, అలాగే 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, పట్టణాల్లో 35 లక్షల చీరల చొప్పున మొత్తం దాదాపు కోటి చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సన్నం బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. స్వంత ఇంటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, జిల్లాలో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగాలని మహిళలు అన్ని రంగాలలో ముందుండాలనే ఉద్దేశంతో సోలార్ పవర్ ప్లాంట్ లు, ఆర్టీసీ బస్సుల కేటాయింపు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ లో భాగస్వామ్యం చేస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించి రాష్ట్ర ప్రగతికి తోడ్పాటు అందించాలన్నారు.


ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ లు  మల్ రెడ్డి రాంరెడ్డి, చల్లా నర్సింహా రెడ్డి, కోదండరెడ్డి,అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పీడీ శ్రీలత, షాబాద్ మండలం మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోట లక్ష్మీ ,జిల్లాకు సంబందించిన ఐకేపీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >