Posted on 2025-11-23 13:56:42
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో ఆదివారం డిఏ ఫర్నిచర్ షోరూమ్ ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరం రోజురోజుకి తెలంగాణలోని అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెంబర్ వన్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఒకప్పుడు ఏ చిన్న ఫర్నిచర్ అవసరం ఉన్న హైదరాబాద్, ఇతర మహా నగరాలకు వెళ్లి ఖరీదు చేసుకొని రావాల్సి ఉండేదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు భిన్నంగా నిజామాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నగరంలో డిఏ ఫర్నిచర్ షోరూమ్ ని స్థాపించిన యాజమాన్యం సాయ రెడ్డి, స్వప్న అనే దంపతులు నిజామాబాద్ లాంటి నగరాల్లో అత్యాధునిక టెక్నాలజీ తో కూడిన ఫర్నిచర్ షోరూమ్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మాట్లాడుతూ నగరంలో ఆదివారం రోజు ఆరవ బ్రాంచ్ ను స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. తక్కువ బడ్జెట్ తో నాణ్యమైన, మన్నికైన ఫర్నిచర్ అందించడం తమ ప్రత్యేకత అని అన్నారు. ఏ ఫర్నిచర్ షాపుల్లో లభించని విధంగా తమ షాపులో తక్కువ ధరకు అన్ని రకాల ఫర్నిచర్ లను కస్టమర్లకు అందించడం జరుగుతుందన్నారు. తమ షోరూమ్ కు వచ్చి జిల్లా ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో జడ్పిటిసి ఫోరం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >