Posted on 2025-11-23 18:26:42
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో ఆదివారం డిఏ ఫర్నిచర్ షోరూమ్ ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరం రోజురోజుకి తెలంగాణలోని అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెంబర్ వన్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఒకప్పుడు ఏ చిన్న ఫర్నిచర్ అవసరం ఉన్న హైదరాబాద్, ఇతర మహా నగరాలకు వెళ్లి ఖరీదు చేసుకొని రావాల్సి ఉండేదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు భిన్నంగా నిజామాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నగరంలో డిఏ ఫర్నిచర్ షోరూమ్ ని స్థాపించిన యాజమాన్యం సాయ రెడ్డి, స్వప్న అనే దంపతులు నిజామాబాద్ లాంటి నగరాల్లో అత్యాధునిక టెక్నాలజీ తో కూడిన ఫర్నిచర్ షోరూమ్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మాట్లాడుతూ నగరంలో ఆదివారం రోజు ఆరవ బ్రాంచ్ ను స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. తక్కువ బడ్జెట్ తో నాణ్యమైన, మన్నికైన ఫర్నిచర్ అందించడం తమ ప్రత్యేకత అని అన్నారు. ఏ ఫర్నిచర్ షాపుల్లో లభించని విధంగా తమ షాపులో తక్కువ ధరకు అన్ని రకాల ఫర్నిచర్ లను కస్టమర్లకు అందించడం జరుగుతుందన్నారు. తమ షోరూమ్ కు వచ్చి జిల్లా ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో జడ్పిటిసి ఫోరం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >