Posted on 2025-11-23 12:25:35
సంజయ్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలి
ప్రభుత్వ సలహాదారులు తెచ్చుకోవాలిసుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ వెల్లడి
నా రాజకీయ గురువు డి. శ్రీనివాస్
ఆయన ద్వారానే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను..
పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
అట్ట హాసంగా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుని బాధ్యతలు స్వీకరించిన మాజీ మేయర్ సంజయ్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు నూతన అధ్యక్షునిగా నియామకమైన మాజీ మేయర్ ప్రస్తుత మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా అతిరథ మహారధుర నడుమ ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు పాల్గొన్నారు. అదేవిధంగా టిపిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ శిష్యుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు సరైన గౌరవం దక్కుతుందని వారు అన్నారు. అలాగే మాజీ మేయర్ సంజయ్ అటు మున్నూరు కాపుల ఐక్యతను చూస్తూనే, తనకున్న రాజకీయ అనుభవంతో ఇకపై జిల్లా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలని వారు కోరారు. కష్టపడ్డ వారికి నిజాయితీతో ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ద్రోహం చేయదని అన్నారు. ఇందూరు అంటేనే డిఎస్ గా అపార రాజకీయ అనుభవం కలిగిన సంజయ్ తండ్రి పెద్దవారు డి శ్రీనివాస్ అడుగుజాడల లో నడవడం అభినందనీయం అన్నారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సంజయ్ కాంగ్రెస్ పార్టీ తరపున చురుకైన పాత్ర పోషించాలని వారు అన్నారు. అనంతరం టిపిసిసి చీఫ్ తన రాజకీయ గురువు అప్పటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ అని, ఆయనే తనకు రాజకీయ ఓనమాలు నేర్పారని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా మున్నూరు కాపు సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >