Posted on 2025-11-22 15:32:30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతమైన ప్రచారం!
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖామాత్యులు గడ్డం వివేక్, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు సారధ్యంలో ఈనెల 23న( ఆదివారం) హైదరాబాదులో నిర్వహించబడే "మాలల రణభేరి"ని మాలలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి , కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు కొప్పరి నవతన్ నేతృత్వంలో గత వారం రోజులుగా విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించారు. మాలల రణభేరి కరపత్రాలను అందరికీ అందించి ఆహ్వానించారు
ఈ సుదీర్ఘ కార్యక్రమంలో వీరితోపాటు మాల మహానాడు రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పీక కృష్ణ, చింతలచెరువు గిరీశం, వరప్రసాద్, డాక్టర్ తమ్మళ్ళ రవికుమార్, గిడ్ల పురుషోత్తం , జనార్ధన్ మరియు మాల మహానాడు రాష్ట్ర మహిళా నాయకురాళ్లు శ్రీమతి బడికల పుష్పలత, శ్రీమతి జోగు రమాదేవి ,శ్రీమతి కిరీష రత్న కుమారి, శ్రీమతి కుంచె లావణ్య, శ్రీమతి రెంటపల్లి మాధవీలత తదితరులు విస్తృతంగా పాల్గొన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >