Posted on 2025-11-19 16:16:25
గుంతలు పడ్డ రోడ్లు మర్మతులు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన
కొత్తగూడెం కార్పొరేషన్లో సమస్యలు పరిష్కరించాలని వినతి
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:గత మూడు నెలల కాలం నుంచి భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా గుంతలమయమైన రోడ్లను బాగు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగిందని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి రామవరం గోధుమ వాగు బ్రిడ్జి మీద నిరసన తెలిపారు. పాడైన రోడ్లు బాగు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం కొత్తగూడెం కార్పొరేషన్ మేనేజర్ ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. (కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో) సీతాలక్ష్మి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల పార్టీ ఇంచార్జి వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రోడ్లు బాగు చేయాలని అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా అధికారుల తీరులో మార్పు రావడం లేదని మండిపడ్డారు. కొత్తగూడెం వ్యాప్తంగా ఎక్కడ గుంతలకు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవన్నారు. తక్షణమే కొత్తగూడెం కార్పొరేషన్ వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని, రామవరంలోని శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల పార్కును అభివృద్ధి చేయాలని కోరారు. కార్పొరేషన్ పరిధిలో కోతులు, కుక్కల బెడద తగ్గించాలని తెలిపారు. రామవరం వనమా పార్కు నేమ్ బోర్డును సరి చేయాలని, పర్యవేక్షణ లోపం కారణంగా మరుగున పడ్డ మరుగుదొడ్లకు మరమ్మతులు చేయాలని స్పష్టం చేశారు. కార్పొరేషన్ వ్యాప్తంగా పాడయిన చోట స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తవ్విన సీసీ రోడ్లను తిరిగి నిర్మించి పంపు కనెక్షన్లు ఇవ్వాలన్నారు. మూలనపడ్డ పారిశుద్ధ్య ట్రాలీలకు మరమ్మతులు చేసి వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాల్సిన సామాగ్రిని అందజేయాలని తెలియపరిచారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, మాజీ కౌన్సిలర్లు ప్రసాద్, అంబుల వేణు, తోగరు రాజశేఖర్, తాండ్ర శీను, పల్లపురాజు దూడల కిరణ్, హుస్సేన్, పిల్లి కుమార్, రామిళ్ళ మధు, మునీర్, తమ్మిశెట్టి అశోక్, మద్దెల సుధీర్, వెంకటరమణ, రిజ్వాన్, అజ్మీర విజయ్, బుద్ధి మధుసూదన్ రావు, పేరం సందేశ్, వంటేరు కళ్యాణ్, పూర్ణచందర్ నాయక్, మనోజ్, సిద్దు, అనీష్, హైమద్, అజ్జు, రిజ్జు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >