Posted on 2025-11-18 18:27:45
డైలీ భారత్ న్యూస్,టెక్మాల్: ఏసీబీ ట్రాప్ను గమనించిన ఓ ఎస్ఐ పోలీసు స్టేషన్ వెనుక వైపు గోడ దూకి, పొలాల మీదుగా పరుగులు తీశారు. అక్కడే మాటు వేసిన సుమారు 15 మంది ఏసీబీ సిబ్బంది ఎస్ఐని వెంబడించి పట్టుకున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్టేషన్ వద్ద జరిగింది. ఏసీబీకి ఎస్ఐ రాజేశ్ చిక్కినట్లు తెలియడంతో స్థానికులు టపాసులు పేల్చి కేరింతలు పెట్టారు.
మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు అద్దెకు తీసుకొచ్చిన హార్వెస్టర్ బ్యాటరీ చోరీ ఘటనపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసు పరిష్కరించడానికి అసద్ మహమ్మద్ పల్లికి చెందిన రైతు పాండుకు స్థానిక ఎస్ఐ రాజేష్ రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఒప్పందం ప్రకారం మొదటి దఫాగా రూ.30వేలు బాధితుడు ఇచ్చాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ రోజు టెక్మాల్ పోలీస్ స్టేషన్లో బాధితుడు రూ. 20వేలు ఎస్ఐకు ఇచ్చి వెళ్తుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఏసీబీ ట్రాప్ పై అనుమానం వచ్చిన ఎస్ఐ పోలీస్ స్టేషన్ గోడ దూకి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాదాపు 15 మందితో కూడిన అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం పొలాల్లో పరిగెత్తుతున్న ఎస్ఐ ను వెంబడించి పట్టుకున్నారు. టెక్మాల్ పోలీస్ స్టేషన్ లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కాగా ఓ వైపు ఏసీబీ అధికారులు ఎస్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విచారిస్తుండగా మరోవైపు స్థానికులు టపాసులు పేల్చడం గమనార్హం.
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >