Posted on 2025-11-18 16:44:11
బిజెపి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అర్బన్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిధి గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలపడేది కార్యకర్తల అంకితభావం ద్వారానే అని చెప్పారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా బిజెపి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ కమిటీలను బలోపేతం, చేయాలని సూచించారు. కార్యక్రమంలో పోతంకర్ లక్ష్మి నారాయణ గారు, బీజేపీ సీనియర్ నాయకులు న్యాలం రాజు, బీజేపీ జిల్లా సెక్రటరీ జోతి, జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్ పుట్ట వీరేందర్, బీజేపీ మండల అధ్యక్షులు తారక్ వేణు, ఆనంద్ రావు, ఇప్పకాయల కిషోర్, గడ్డం రాజు, కోడూరు నాగరాజు, భూపతి అన్ని డివిజన్ల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >
అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు
Posted On 2026-05-04 18:49:53
Readmore >