Posted on 2025-11-16 09:15:58
125వ నెల 576 మందికి ఉచితంగా వైద్య సేవలు
డైలీ భారత్, వైరా:వైరా సిపిఎం కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో ప్రతి నెల మూడవ ఆదివారం బోడేపూడి కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోడేపూడి వైద్య శిబిరాన్ని 125వ నెల విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం బోడేపూడి వైద్య శిబిరం ద్వారా షుగర్, బిపి, కొలెస్ట్రాల్, గ్యాస్, అల్సర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న 576 మంది పేద, మద్యతరగతి ప్రజలు ఉచితంగా వైద్య సేవలు పోందినారు. నెల రోజులకు సరిపడా మందులను కేవలం100 రూపాయలకే అందించారు. బోడేపూడి వైద్య వైద్య శిబిరంపై పూర్తి నమ్మకంతో వేలాది మంది ప్రజలు గత పది సంవత్సరాల క్రితం నుంచి ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. ఈ సందర్భంగా బోడేపూడి కళానిలయం కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఆహార అలవాట్లు, నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. శరీర బరువును నియంత్రించుకోవాలని, చక్కెర, స్వీట్లు ,కూల్డ్రింక్స్ మొదలైన వాటిని పూర్తిగా మానేయాలని, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు ఎక్కువగా తినాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. శీతాకాలంలో చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా షుగర్ పేషంట్స్ గుండె సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోడేపూడి వైద్య శిబిరం బాధ్యులు సుంకర సుధాకర్, వాలంటీర్లు చింతనిప్పు చలపతిరావు, బొంతు సమత, గుడిమెట్ల మోహనరావు, అనుమోలు రామారావు, మాదినేని రజిని, మోదుగు నాగరాణి, మల్లెంపాటి ప్రసాదరావు, హరి వేంకటేశ్వరరావు, కంభంపాటి సత్యనారాయణ, మందడపు నాగేశ్వరావు, పూనాటి సూరయ్య తదితరులు పాల్గొన్నారు.
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >