డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీ ఎం రేవంత్ రెడ్డి కి పోస్ట్ కార్డులను శనివారం పంపారు. మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ లోని గంజ్ కమాన్ కూరగాయల మార్కెట్లో పోస్ట్ బాక్స్ దగ్గర పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కమిటీ జిల్లా అధ్యక్షురాలు సాయమ్మ, సభ్యులు శారద, లావణ్య, సాయమ్మ, లక్ష్మి, సబిత, రూప పాల్గొన్నారు.
News
తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను పోస్ట్ చేసిన మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ నిర్వాహకులు