Posted on 2025-11-15 07:27:36
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ విద్యాసంస్థ కు చెందిన స్కూల్ బస్సు కిందపడి క్లీనర్ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది . నగరంలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాల చెందిన బస్సు అర్సపల్లి ప్రాంతంలో విద్యార్థులను స్కూలుకు తీసుకు రావడానికి వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో బస్సు వెనక్కి తీసే క్రమంలో క్లీనర్ జక్కుల కిషన్ వెంకటయ్య ప్రమాదవశాత్తు బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అంతలా అజాగ్రత్తగా నడిపిఅంతలా అజాగ్రత్తగా నడపే డ్రైవర్ను జిల్లాలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థ యాజమాన్యం ఏ అర్హతతో సదరు డ్రైవర్ను నియమించుకున్నారో ఆ పాఠశాల యాజమాన్యానికే తెలియాలి. అంతలా అజాగ్రత్తగా నడపే ఆ డ్రైవర్ ఒకవేళ అందులో బస్సులో పాఠశాల చెందిన విద్యార్థులు ఉంటే ప్రమాదం జరిగి ఉంటే బాధ్యత ఎవరు వహిస్తారని స్థానికులు పేర్కొంటున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం ధర్మారం (ఎం) గ్రామానికి చెందిన జక్కుల కిషన్ రెండు రోజుల క్రితమే స్కూల్ బస్సు క్లీనర్ గా చేరాడు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఆరవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >
సదాశివనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >