డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సదాశివపల్లి వద్ద శనివారం నిజామాబాద్ -1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
News
అతివేగంతో అదుపుతప్పి లారీని డీకొన్న నిజామాబాద్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు