| Daily భారత్
Logo




ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి

News

Posted on 2025-11-04 14:28:54

Share: Share


ఇందిరా పార్క్ వద్ద  జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రెడ్డి సంఘాలు ఒకే వేదికపై వచ్చి రెడ్డిజాతికి జరుగుతున్న అన్యాయాన్ని విద్యా ఉద్యోగాలు ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాలపై ఈ డబ్ల్యూ ఎస్ అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వానికి తెలిపేందుకు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లబెల్లి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అగ్రవర్ణాల్లోని పేదలకు రాజ్యాంగబద్ధంగా వారికి రావలసిన వాటాను ప్రభుత్వం వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు

 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలుగా వస్తున్న వారు ఇచ్చినటువంటి రెడ్డి కార్పొరేషన్ ఇప్పటివరకు చట్టబద్ధంగా కార్పొరేషన్ కి రూపం లేకపోవడం కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరమని నాయకులు అన్నారు. ఈడబ్ల్యూఎస్ కమిషన్ను రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఎటువంటి సహాయం చేసిన దాఖలాలు లేవు. దీనివల్ల కేవలం ఎమ్మెల్యేగా ఉన్న కుటుంబాలకు మాత్రమే లాభం చేకూర్తులు తప్ప మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఎటువంటి ఉపయోగం లేదని ఈ సందర్భంగా అన్నారు. ఇప్పుడు కావలసింది అగ్రవర్ణాలను పేదలకి విద్య వైద్య ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించాలని అగ్రవర్ణాలకు రావాల్సిన నిధులను ఉద్యోగాలను వారి జనాభా ప్రకారం వారు కేటాయించాలని ఈ సందర్భంగా రెడ్డి సంఘం రాష్ట్ర నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఒక నెల రోజుల గడువు విధించి రానిపక్షంలో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నాయకులు మధుసూదన్ రెడ్డి జిల్లా నాయకులు రాంరెడ్డి రవీందర్ రెడ్డి నరేందర్ రెడ్డి మోహన్ రెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >
Image 1

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

Posted On 2026-07-25 16:44:33

Readmore >
Image 1

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Posted On 2026-07-25 16:42:32

Readmore >
Image 1

ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

Posted On 2026-07-25 15:43:36

Readmore >
Image 1

విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎంఎల్ఏ

Posted On 2026-07-25 15:38:33

Readmore >
Image 1

ప్రతి పనిపై శ్రద్ధ వహించాలి

Posted On 2026-07-25 15:37:20

Readmore >
Image 1

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు

Posted On 2026-07-25 15:36:10

Readmore >
Image 1

విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"

Posted On 2026-07-25 15:35:16

Readmore >
Image 1

సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!

Posted On 2026-07-25 11:36:32

Readmore >
Image 1

బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Posted On 2026-07-25 11:13:48

Readmore >