Posted on 2025-11-04 17:13:21
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని ఐదవ డివిజన్ బోర్గం ( పి) బిజెపి నాయకులు నరేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా మంగళవారం ప్రత్యేక ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రతిభ హాస్పిటల్ లో ఉన్న ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ నీరూపు రెడ్డి, ఆర్థోపెడిక్ డాక్టర్ వంశీధర్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పవన్ కుమార్, లు ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాసేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని, తాను అందించే సేవలు నిజమైన పేదవారికి దక్కినప్పుడే తనకు సంతృప్తిని ఇస్తుందన్నారు. ఇకపై కూడా తాను పదవుల్లో ఉన్న లేకున్నా సమాజ సేవలో ఓ బాధ్యతగల పౌరునిగా నిరంతరం పేదవారి సంక్షేమం వారికి ప్రభుత్వాలపరంగా వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా తెలియజెప్పడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. తాను నివసిస్తున్న ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తున్నానని దాంట్లో భాగంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. అనంతరం మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ఆరోగ్య శిబిరానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించిందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో హాస్పటల్ మేనేజ్మెంట్ ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్రన్న, నాల్గవ డివిజన్ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >