Posted on 2025-11-04 17:13:21
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని ఐదవ డివిజన్ బోర్గం ( పి) బిజెపి నాయకులు నరేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా మంగళవారం ప్రత్యేక ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రతిభ హాస్పిటల్ లో ఉన్న ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ నీరూపు రెడ్డి, ఆర్థోపెడిక్ డాక్టర్ వంశీధర్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పవన్ కుమార్, లు ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాసేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని, తాను అందించే సేవలు నిజమైన పేదవారికి దక్కినప్పుడే తనకు సంతృప్తిని ఇస్తుందన్నారు. ఇకపై కూడా తాను పదవుల్లో ఉన్న లేకున్నా సమాజ సేవలో ఓ బాధ్యతగల పౌరునిగా నిరంతరం పేదవారి సంక్షేమం వారికి ప్రభుత్వాలపరంగా వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా తెలియజెప్పడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. తాను నివసిస్తున్న ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తున్నానని దాంట్లో భాగంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. అనంతరం మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ఆరోగ్య శిబిరానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించిందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో హాస్పటల్ మేనేజ్మెంట్ ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్రన్న, నాల్గవ డివిజన్ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >