| Daily భారత్
Logo




నిజామాబాద్ కలెక్టరేట్లో కలకలం..

News

Posted on 2025-11-03 13:31:12

Share: Share


నిజామాబాద్ కలెక్టరేట్లో కలకలం..

తన భూ సమస్య పరిష్కరించాలంటూ మహిళ గడ్డి మందు తాగేందుకు యత్నం

అడ్డుకున్న కలెక్టరేట్ భద్రత సిబ్బంది

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తన భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ సోమవారం నిజామాబాద్​ కలెక్టరేట్​కు వచ్చింది. తన వెంట పురుగుల మందు తీసుకుని వచ్చింది. ఈ క్రమంలో గడ్డి మందు తాగేందుకు డబ్బాను బ్యాగులో నుంచి బయటకు తీసింది. గమనించిన సెక్యురిటీ సిబ్బంది ఆమె గడ్డి మందు తాగకుండా అడ్డుకున్నారు. రూరల్ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. సాలూర మండలం సాలంపాడ్​కు చెందిన బాధితురాలు జయమ్మ మాట్లాడుతూ తనకు రెండెకరాల పొలం, ఇద్దరు కుమారులు ఉన్నారని,  అయితే తన పొలంలోని అర ఎకరం భూమిని తనకు తెలియకుండా చిన్న కుమారుడు విక్రయించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పొలానికి సంబంధించిన పూర్తి పత్రాలు తన వద్దని ఉన్నాయని తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా పరిష్కారం కావడం లేదని చెప్పారు. దీంతో మనస్థాపంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఆమె వెల్లడించారు.

Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >
Image 1

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

Posted On 2026-07-25 16:44:33

Readmore >
Image 1

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Posted On 2026-07-25 16:42:32

Readmore >
Image 1

ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

Posted On 2026-07-25 15:43:36

Readmore >
Image 1

విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎంఎల్ఏ

Posted On 2026-07-25 15:38:33

Readmore >
Image 1

ప్రతి పనిపై శ్రద్ధ వహించాలి

Posted On 2026-07-25 15:37:20

Readmore >
Image 1

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు

Posted On 2026-07-25 15:36:10

Readmore >
Image 1

విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"

Posted On 2026-07-25 15:35:16

Readmore >
Image 1

సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!

Posted On 2026-07-25 11:36:32

Readmore >
Image 1

బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Posted On 2026-07-25 11:13:48

Readmore >