| Daily భారత్
Logo




బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు

News

Posted on 2025-10-31 13:21:26

Share: Share


బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్  150వ జయంతి వేడుకలు

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:మన దేశ సుస్థిర నిర్మాణానికి ఎనేలేని సేవలు అందించిన ఉక్కుమనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150  వ  జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ, దేశ ప్రజలకు జాతీయ ఐక్యత దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నివాళుల కార్యక్రమం ఘనంగా అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నేతృత్వంలో ఆర్‌ఆర్‌ చౌరస్తా శివాజీ విగ్రహం నుండి వర్ని చౌరస్తా వద్ద ఉన్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు రన్ ఫర్ యూనిటీ  నినాదం తో భారీ మార్చ్  నిర్వహించారు. జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. నగర  వాసులు, యువత భారీ సంఖ్యలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్దార్ పటేల్  కేవలం ఒక నాయకుడు కాదని, ఆయన ఒక శక్తి, ఒక సంకల్పం, ఒక ధైర్యస్వరూపం అని కొనియాడారు. దేశం స్వతంత్రం పొందిన వెంటనే 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం — చరిత్రలో ఓ అద్భుతం. ఈవి ఏవి బలప్రయోగం ద్వారా కాదు, ఆయన తెలివితేటలు, దౌత్యం, కఠిన నిర్ణయాలు భారతదేశాన్ని ఐక్యంగా నిలిచేలా చేశాయి అని గుర్తుచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో, పటేల్  కలల భారత్ సాకారం అవుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం  నిర్మాణం — పటేల్ వారసత్వాన్ని నూతన భారతానికి పరిచయం చేసిందన్నారు. బలమైన నిర్ణయాలు, స్థిర నిబద్ధత ఇవన్నీ పటేల్ స్ఫూర్తి అని, ఈరోజు మనం సర్దార్ పటేల్ జయంతిని జరుపుకోవడం అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు. భారత ఐక్యతను కాపాడే బాధ్యతను మళ్లీ గుర్తుచేసుకునే రోజు ఇది అని అన్నారు. దేశ భవిష్యత్తు కోసం పనిచేసే ప్రతి యువకుడు ఆయన స్ఫూర్తిని అనుసరించాలన్నారు. ఆయన త్యాగం, నిబద్ధత తరతరాలకు దిశానిర్దేశం చేస్తాయి అని యువతకు దిశానిర్దేశం చేసారు. సర్దార్ పటేల్ మహనీయ స్ఫూర్తికి గుర్తుగా వారి విగ్రహం ఉన్న వర్ణి చౌరస్తాను ఇవాళ నుండి ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా ’గా పిలవాలని కోరారు. యూనిటీ మార్చ్ అనంతరం సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐక్యత, సేవ, దేశభక్తి విలువలను ప్రజలు ఆచరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు జాతీయ చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >
Image 1

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

Posted On 2026-07-28 08:06:38

Readmore >
Image 1

అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

Posted On 2026-07-28 08:04:20

Readmore >
Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >