Posted on 2025-10-30 14:46:27
డైలీ భారత్, మెదక్: అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు జరుగతున్నా.. భయపడకుండా లంచాలు తీసుకుంటున్నారు. ప్రతి పనికి ఓ రేటు కడుతున్నారు. కొందరు అధికారులైతే లంచం తీసుకోవడం హక్కుగా భావిస్తున్నారు. తాజాగా ఏసీబీ అధికారులు మెదక్ ట్రాన్స్కో డీఈ మహమ్మద్ షరీఫ్ ఖాన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేపట్టారు. పాపన్నపేట (Papannapet) మండలం సీతానగరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేశాడు. దానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి డీఈ మహమ్మద్ షరీఫ్ ఖాన్ రూ.40 వేల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు బతిమిలాడటంతో రూ.30 వేలు తీసుకోవడానికి అంగీకరించాడు. ఇప్పటికే రూ.9 వేలు ఇచ్చాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో గురువారం రూ.21 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు డీఈ మహమ్మద్ షరీఫ్ ఖాన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >