| Daily భారత్
Logo




జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో పురుగుమందు తాగి వ్యక్తి మృతి

News

Posted on 2025-10-30 14:37:44

Share: Share


జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో పురుగుమందు తాగి వ్యక్తి మృతి

డైలీ భారత్, జూలూరుపాడు:కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భానోతు కబీర్ దాస్ ,45 సంవత్సరాలు మాచినపేట రెవెన్యూ పరిధిలో 0.35 గుంటల వ్యవసాయ భూమి ఉన్నదని, అట్టి భూమిని కబీర్ దాస్ అన్న కొడుకు అయిన బానోతు లింగ ఆక్రమించుకొని, భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసినాడని, అట్టి భూమి లింగాదే అంటూ బానోతు హేమ్ల తప్పుడు కాగితాలు రాసినాడని, అదే భూమిని కబీర్దాస్ పేరుమీద పట్టా చేయిస్తానని గుగులోతు కృష్ణ అనే అతను మూడు లక్షల రూపాయలు కబీర్ దాస్  వద్ద తీసుకున్నాడని, మరోపక్క గ్రామ పెద్దమనిషి అయిన భానోతు కిషన్ కలుగజేసుకుని అట్టి భూమి కబీర్దాస్ పేరుమీద పట్టా చేయించవద్దంటూ లింగాపై ఒత్తిడి చేశాడని, అయితే మృతుడు కబీర్ దాస్ తన భూమి చుట్టూ లింగా వేసిన ఫెన్సింగ్  తీయించాలని, లింగ మరియు సునీతలను వేడుకున్నను, మృతుడి మాటలు లెక్కచేయకుండా ఏం చేసుకుంటావో, చేసుకో అని బూతులు తిట్టినారని, బానోతు లింగ మరియు లింగా భార్య సునీతలు బానోతు హేమ్ల, గుగులోతు కృష్ణ, బానోతు కిషన్ కబీర్ దాస్ ను  ఇబ్బందులకు గురి చేయగా, వారు పెట్టిన ఇబ్బందులు తాళలేక మరియు తన భూమి తనకు దక్కకుండా పోతుందేమోనన్న భయముతో కబీర్ దాస్ తేదీ ఇంట్లోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా, కుటుంబ సభ్యులు గమనించి, చికిత్స కొరకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి, తరలించగా చికిత్స కోసం  ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి,నుండి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించినను కబీర్ దాస్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రి  చికిత్స పొందుతూ ,ఉదయం 5 గంటల సమయంలోమృతిచెందినాడని,మృతుడి కుమారుడు భానోత్ నందు, ఎస్ఐఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవి , బానోతు లింగ, సునీత, బానోతు హేమల, గుగులోతు కృష్ణ, బానోత్ కిషన్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినారు.

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >