| Daily భారత్
Logo




అకాల వర్షాల కారణంగా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి

News

Posted on 2025-10-30 19:02:18

Share: Share


అకాల వర్షాల కారణంగా తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి

నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించిన బిజెపి నాయకులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో లక్షల ఎకరాల్లో కోసిన వరి పంటను రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచారు. అయితే, కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవడం, ప్రారంభమైన కేంద్రాల్లో కూడా వడ్ల కుప్పలు లేపకపోవడం వలన, ఇటీవలి భారీ వర్షాల కారణంగా రోడ్లపై, కల్లాల వద్ద ఉన్న ధాన్యం తడిసి నష్టపోయింది. ఫలితంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని మాయిశ్చర్ కంటెంట్ కారణంగా తిరస్కరించకుండా బాయిల్ రైస్ మిల్లులకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రంగు మారిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కనీస మద్దతు ధర కు కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరారు.

భవిష్యత్తులో అకాల వర్షాల ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు ప్రభుత్వం టార్పాలిన్లను ఉచితంగా లేదా సబ్సిడీతో అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో బిజెపి బృందం నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మి నారాయణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, బీజేపీ నాయకులు న్యాలం రాజు, పద్మరెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌

Posted On 2026-05-27 09:32:36

Readmore >
Image 1

హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-26 10:43:36

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-26 08:13:24

Readmore >
Image 1

జీవ నదులను కాపాడుకోకపోతే భవిష్యత్తే ఉండదు : పవన్ కళ్యాణ్

Posted On 2026-05-26 07:43:54

Readmore >
Image 1

కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

Posted On 2026-05-25 21:25:57

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Posted On 2026-05-25 19:54:35

Readmore >
Image 1

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

Posted On 2026-05-25 19:25:02

Readmore >
Image 1

మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష

Posted On 2026-05-25 19:19:35

Readmore >
Image 1

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి

Posted On 2026-05-25 19:18:11

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >