Posted on 2025-10-24 15:14:02
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఈ నెల 25 న తమ సొంత ఊరు నిజామాబాద్ నుంచి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. 33 జిల్లాల్లో 4 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో రెండు రోజులు ఉండి అక్కడ ఉన్న మేధావులను, విద్యార్థులను, రైతులను, యువకులను, ఆడబిడ్డలను లిసి ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి జిల్లా ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన కవిత జిల్లా వాసులకు ఎంతో సుపరిచితం, ఆ పార్టీ నుండి సస్పెన్షన్ గురైన తర్వాత తొలిసారిగా కవిత జనం బాట అనే కార్యక్రమం ద్వారా జిల్లాకు రానున్నారు.అయితే కవిత చేపడుతున్న జనం బాట కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇప్పటివరకు జిల్లాకు చెందిన జాగృతి నాయకులు అధికారికంగా మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. సెంటిమెంట్గా కవిత రేపటి నుంచి జిల్లాలో ప్రారంభిస్తున్న జనంబాట కార్యక్రమం ఎక్కడినుండి ప్రారంభిస్తారు. నిజామాబాద్ నుంచి లేదా కవిత అత్తగారి ఊరు పోతంగల్ గ్రామం నుండి జనం బాట కార్యక్రమం చేపడతారా అనేది జిల్లాకు చెందిన స్పష్టత ఇవ్వకపోవడం కోసమెరుపు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 17:47:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 17:34:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 17:33:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >