Posted on 2025-10-24 15:14:02
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఈ నెల 25 న తమ సొంత ఊరు నిజామాబాద్ నుంచి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. 33 జిల్లాల్లో 4 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో రెండు రోజులు ఉండి అక్కడ ఉన్న మేధావులను, విద్యార్థులను, రైతులను, యువకులను, ఆడబిడ్డలను లిసి ఆయా జిల్లాల్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి జిల్లా ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన కవిత జిల్లా వాసులకు ఎంతో సుపరిచితం, ఆ పార్టీ నుండి సస్పెన్షన్ గురైన తర్వాత తొలిసారిగా కవిత జనం బాట అనే కార్యక్రమం ద్వారా జిల్లాకు రానున్నారు.అయితే కవిత చేపడుతున్న జనం బాట కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఇప్పటివరకు జిల్లాకు చెందిన జాగృతి నాయకులు అధికారికంగా మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. సెంటిమెంట్గా కవిత రేపటి నుంచి జిల్లాలో ప్రారంభిస్తున్న జనంబాట కార్యక్రమం ఎక్కడినుండి ప్రారంభిస్తారు. నిజామాబాద్ నుంచి లేదా కవిత అత్తగారి ఊరు పోతంగల్ గ్రామం నుండి జనం బాట కార్యక్రమం చేపడతారా అనేది జిల్లాకు చెందిన స్పష్టత ఇవ్వకపోవడం కోసమెరుపు.
పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Posted On 2026-05-12 19:21:38
Readmore >
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...
Posted On 2026-05-12 19:11:46
Readmore >