Posted on 2026-07-07 17:34:52
డైలీ భారత్ నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా న్యాల్కల్కు చెందిన ప్రశాంత్ భార్య సంధ్యకు, అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల ప్రశాంత్ గల్ఫ్ దేశం నుంచి తిరిగి వచ్చాడు. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన సంధ్య.. అతడిని వదిలించుకోవాలని పథకం రచించింది. ఇందులో భాగంగా స్థానికుడైన సాయి అలియాస్ బంటి అనే వ్యక్తితో కలిసి స్కెచ్ వేసింది. ప్రశాంత్తో బంటి కలిసి మద్యం సేవించిన తర్వాత.. ప్లాన్ ప్రకారం మేడపై నుంచి కిందకు తోసేశారు.
తీవ్ర గాయాలైన ప్రశాంత్ను ఏమీ తెలియనట్లు మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ సంధ్య తన క్రూరత్వాన్ని వీడలేదు. ఎవరూ లేని సమయం చూసి, టాయిలెట్ క్లీనర్ హార్పిక్ లిక్విడ్ను సిరంజి ద్వారా భర్త ప్రశాంత్ నరాల్లోకి ఎక్కించి ప్రాణాలు తీసింది.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 17:47:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 17:34:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 17:33:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >