Posted on 2025-10-18 18:54:30
అధికార లాంఛనాల మధ్య హత్యకు గురైన కానిస్టేబుల్ అంత్యక్రియలు సిపి వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:శుక్రవారం రాత్రి పాత రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హత్యకు గురై మృతిచెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య శనివారం తన స్వగృహం త్రీ టౌన్ పరిదిలోని న్యూ బ్యాంకు కాలనీ లో నివాళులు అర్పించారు. ఈ అంత్యక్రియలలో ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పీ.ఎస్., మల్టీ జోన్ 1, ఐజిపి నార్త్ తెలంగాణ, హైదరాబాద్, నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్. హాజరు అయి పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమయాత్రను నిర్వహించారు. అనంతరం ఐజిపి మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అడిషనల్ డీసీపీ ( అడ్మిన్ ) బస్వారెడ్డి, అదనపు డిసిపి ( ఎ. ఆర్ ) రామచంద్ర రావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సిటిసి, సిసిఎస్, ఏసీపీలు , నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు , స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు , భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
Posted On 2026-05-09 17:26:47
Readmore >
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >