Posted on 2025-10-17 20:27:01
సుధీర్ రమ్నాథ్ కేకన్, ఐపీఎస్ జిల్లా పోలీసు అధికారి, మహబూబాబాద్
డైలీ భారత్ న్యూస్,మహబూబాబాద్:దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకులు అంటూ సోషల్ మీడియా, మెసేజ్లు, ఈమెయిల్లు, వెబ్సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు సృష్టించి, బ్యాంక్ వివరాలు, OTPలు, యూపీఐ పిన్లు తీసుకొని ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారు అని అన్నారు.
అక్టోబర్ 1 నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది మోసపోయి రూ. 8.5 లక్షల వరకు నష్టం కలిగింది.నకిలీ షాపింగ్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను మోసగాళ్లు ఆకర్షించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాక మోసగాళ్లు
వాట్సాప్, SMS, టెలిగ్రామ్ ద్వారా ఫిషింగ్ లింకులు పంపడం.
యాప్ డౌన్లోడ్ చేయమని చెప్పి బ్యాంక్ వివరాలు సేకరించడంలాంటివి చేస్తారు.
గూగుల్లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు పొందపరచి మోసం చేస్తారు.ప్రజలకు సూచనలు చేస్తూ
ధృవీకరించిన వెబ్సైట్లు మరియు అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేయండి అని తెలిపారు.
టెలిగ్రామ్ లేదా ఇతర లింక్ల ద్వారా APK ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దు.ఎవరికీ బ్యాంక్ వివరాలు, OTP, యూపీఐ పిన్లు పంచుకోవద్దు.
ముందుగానే చెల్లింపులు చేయకుండా, “Cash on Delivery (CoD)” సదుపాయాన్ని వినియోగించండి.ఎలాంటి మోసాలు జరిగిన వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >