Posted on 2025-10-15 08:06:10
డైలీ భారత్, ఆర్మూరు:కట్టుకున్న భార్యను భర్త అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఆర్మూర్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. బాపట్లకు చెందిన వడ్ల జగదీష్, మమత (35) దంపతులు. గత కొంత కాలంగా వీరు ఆర్మూర్ లోని వేంకటేశ్వరకాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరూ పిల్లలు. జగదీశ్ పట్టణంలోని చెక్క మిల్లులో వర్కర్ గా పని చేస్తున్నాడు. కొంత కాలంగా జగదీష్ తన భార్య మమతపై అనుమానం పెంచుకున్నాడు. తన భార్య తన కళ్లు గప్పి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్న జగదీష్ భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. తన భార్య మమతపై జగదీష్ అనుమానపు వేధింపులు తీవ్రం కావడంతో వీరి సంసారంలో ప్రశాంతత కరువైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం పని చేసే సా మిల్ నుంచి లంచ్ చేసేందుకు ఇంటికి వచ్చిన జగదీష్ భార్యతో మళ్లీ గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో కోపంతో విచక్షణ కోల్పోయిన జగదీష్ కత్తితో తన భార్య మెడను అతి కిరాతకంగా నరికాడు. దీంతో మమత అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం జగదీశ్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి తాను నేరం చేశానని ఒప్పుకున్నట్టు సమాచారం.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Posted On 2026-05-07 12:09:14
Readmore >
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >