Posted on 2025-10-13 13:02:18
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తానా కలం గ్రామానికి చెందిన ఇంగోలి శిరీష తనకు జరుగుతున్న అన్యాయాన్ని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. కానాకాలం గ్రామంలో ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నానని, అందుకు అన్ని అర్హతలు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి వెళ్ళాకే మొదటి విడత ప్రకటించారని ఆ జాబితాలో తన పేరు అన్ని అర్హతలు ఉన్నాయని ఇంగోలి శిరీష తెలిపారు. అయితే విద్యాశాఖ రెండో జాబితా ప్రకటించాక ఆ జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్థాపానికి గురై ఎడపల్లి ఎంఈఓ ను కలవగా ఇదంతా తనకేమీ తెలువదని మొత్తం జిల్లా విద్యాశాఖ అధికారికి తెలుసని ఏదైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్లి సంప్రదించవచ్చని చెప్పారని ఆమె వెల్లడించారు. రెండో జాబితాలో తన పేరు లేకపోవడంలో కచ్చితంగా జిల్లా విద్యాశాఖ మండల విద్యాశాఖ అధికారుల అవినీతి వల్లే రెండో జాబితాలో తన పేరును తొలగించి మరొక వ్యక్తి పేరును చేర్చడం జరిగిందని ఈ పూర్తిగా తనకు అన్యాయం జరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జీవో ప్రకారం ఎక్స్పీరియన్స్ అని అందులో లేదు కానీ ఆ వ్యక్తిని ఎక్స్పీరియన్స్ ఉందని తీసుకున్నామని డిఇఓ చెప్తున్నారని దీనిపై కలెక్టర్ తగిన విచారణ చేసి తనకు వచ్చిన ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని ఆమె వేడుకున్నారు దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే జిల్లా విద్యాశాఖ అధికారుల పై కోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె అన్నారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >