Posted on 2024-01-04 04:48:50
డైలీ భారత్, హైదరాబాద్: ప్రఖ్యాతిగాంచిన అదానీ గ్రూపు కంపెనీలు తెలంగా ణ రాష్ట్రంలో విస్తరించడానికి మార్గం సుగమమైంది.
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, పరిశ్రమల శా ఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు, సీనియర్ అధికారులతో బుధవారం సచివాలయంలో భేటీ అయిన అదాని గ్రూప్ కంపెనీల అధినేత గౌతమ్ అదానీ పెద్ద కుమారుడు, సిఇ ఓ కరణ్ అదానీ, అదానీ ఎయిరోస్పేస్ సిఇఓ ఆశీష్రాజ్వన్షీల ప్రతినిధి బృందంతో సుదీర్ఘ చర్చలు జరిగాయి.
తెలంగాణలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు, ఎయిరో స్పే స్ కంపెనీల ఏర్పాటుకు అవసరమైన పాలసీని, రాయితీలు, సబ్సిడీలు, వసతులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నే తృత్వంలో అధికారులు అదానీ గ్రూపు ప్రతినిధులకు వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కు అవసరమైన భూమి, విద్యుత్తు, నీరు, రోడ్లు, డ్రైనేజీ వ్య వస్థ, క్లియరెన్స్ల కోసం అమలులో ఉన్న సింగిల్ విం డ్ వ్యవస్థల పనితీరును రాష్ట్ర అధికారులు అదానీ గ్రుపు ప్ర తినిధి బృందానికి వివరించారు.
దాంతో సంతృప్తి చెందిన కరణ్ అదానీ బృందం తెలంగాణలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనకు తమ కంపెనీ ముందుంటుం దని అన్నారు.
అంతేగాక రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటుగా డేటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనే సంక ల్పంతో వచ్చామని, కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సంభాషించిన తర్వాత అదానీ గ్రూపులో ఉన్న ప్రతి కంపెనీల బ్రాంచ్ లను తెలంగాణలో ఏర్పా టు చేయడానికి ఉత్సాహం గా ఉన్నామని కరణ్ అదానీ అన్నారని కొందరు అధికా రులు తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో నెలకొల్పుతున్న కంపెనీల పురోగతితో పాటు కొత్త కంపెనీల ఏర్పాటుపై సుధీర్ఘంగా చర్చలు జరిగాయని వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధ్దంగా ఉన్నామని కరణ్ అదానీ ఎంతో సంతోషంతో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డికి హామీ ఇచ్చారని తెలిపారు.
భద్రాచలం సర్పంచ్ పున్నెం కృష్ణ ఘనంగా సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి
Posted On 2026-02-14 08:27:20
Readmore >
జూలూరుపాడు మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతకుమారి
Posted On 2026-02-14 07:54:12
Readmore >
మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణానికి ముస్తాబైన పాపకొల్లు శ్రీ శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం
Posted On 2026-02-14 07:47:12
Readmore >
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >