Posted on 2025-10-11 08:40:33
ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని సాయిబాను హామీ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకి చెందిన మహిళా నాయకురాలు ఎస్. గాయత్రి, ఆర్టిఐ యాక్ట్ 2025 లీగల్ ప్రొటెక్షన్ సొసైటీ (రిజిస్టర్ నం: 609-2023) రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా (స్టేట్ వైస్ ప్రెసిడెంట్) ఇటీవల ఎన్నికయ్యారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ ఆర్ సాయి బానుఈ సందర్భంలో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ “ప్రజా సమస్యల పరిష్కారానికి, సమాజంలో పారదర్శకత కోసం, సాధారణ ప్రజలకు ఆర్టిఐ చట్టం ద్వారా అందుతున్న న్యాయపరమైన రక్షణను మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తాను. భవిష్యత్తులో ప్రజల సమస్యలను అర్ధం చేసుకుని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాను” అని అన్నారు.ఇంకా ఆమె మాట్లాడుతూ, “నాపై విశ్వాసం ఉంచి నన్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి నన్ను మరింత బాధ్యతతో ముందుకు నడిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాప్రజలకు నేను రుణపడి ఉంటాను. వారి ఆశలకనుగుణంగా పనిచేస్తాను" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు, ఆర్టిఐ యాక్ట్ 2025 లీగల్ ప్రొటెక్షన్ సొసైటీ సభ్యులు, ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళలకు ఆర్ సాయి బాను ధన్యవాదాలు తెలియజేసుకున్నారు
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >