Posted on 2025-10-05 20:19:28
స్థానిక సంస్థలు ఉన్నాయని ప్రకృతి విపత్తులపై రాజకీయాలు చేయడం సిగ్గుమాలిన చర్య
హరీష్ రావు కామారెడ్డి జిల్లాలో పర్యటనపై ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ విమర్శలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లా ప్రజలు వరదలతో అల్లాడితే నెలరోజుల తర్వాత తీరిగ్గా వచ్చి పరామర్శిస్తారా.. అంటూ మాజీ మంత్రి హరీశ్ రావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. హరీష్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రకృతి విపత్తుపై రాజకీయం చేయడం సిగ్గుచేటని షబ్బీర్ అలీ విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో వర్షాలు, వడగళ్ల వానలతో ఎన్నోసార్లు పంట నష్టం జరిగినా ఏ ఒక్కసారి కూడా రైతులను ఆదుకోలేదన్నారు. ప్రస్తుతం హరీష్ రావు ఇక్కడి ప్రజలపై ప్రేమతో రాలేదని, స్థానిక ఎన్నికల్లో పరువు కాపాడుకోవడానికి వచ్చారని విమర్శించారు. కుటుంబ సమస్యల నుంచి తేరుకొని బాధితులను పరామర్శించడానికి నెల రోజులు పట్టిందని ఎద్దేవా చేశారు. నాడు ప్రజల నివాసాలు నీళ్లలో కొట్టుకుపోయి హాహాకారాలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎటుపోయారని ప్రశ్నించారు. వర్షాల్లో ప్రమాదమని తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో ముంపు ప్రాంతాలు పరిశీలించడానికి వచ్చారని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించక ప్రజలను పరామర్శించలేకపోయారన్నారు. తిరిగి రెండు రోజుల్లో వచ్చి నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.11వేలు, చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు అందించారని గుర్తు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించి అధికారులను సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారని, అధికారుల నివేదికను కేంద్రానికి పంపించారన్నారు.
కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం
Posted On 2026-05-06 18:21:36
Readmore >
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >