Posted on 2025-10-05 17:40:18
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లక్డీకపూల్ అశోక హోటల్లో బీసీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నేతలతో కూడిన అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ" రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని" కోరారు. అలాగే చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్తో పాటు విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. బీసీలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.. ఈ పోరాటంలో తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తాను అని మల్క కొమరయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >