Posted on 2025-10-05 17:40:18
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లోని లక్డీకపూల్ అశోక హోటల్లో బీసీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నేతలతో కూడిన అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ" రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని" కోరారు. అలాగే చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్తో పాటు విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. బీసీలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.. ఈ పోరాటంలో తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తాను అని మల్క కొమరయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం
Posted On 2026-05-06 18:21:36
Readmore >
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >