Posted on 2025-10-02 17:23:55
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ల జయంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ అందు ఆ మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తిలక్ గార్డెన్ వద్ద గల లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి,గాంధీ చౌక్ లోని మహాత్మగాంధీ విగ్రహానికి నుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేశ వేణు మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకు రావడానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగిందని, ఉప్పు సత్యాగ్రహం వంటి ఎన్నో ఉద్యమాలు చేసి శాంతి,అహింస ద్వారా ఉద్యమాన్ని ముందుక నడిపిన గొప్ప నాయకుడని,స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఎంతో మంది మహానుభావులు ఉంటే అందులో మొదటి వరుసలో మహాత్మా గాంధీ వున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా St సెల్ అధ్యక్షులు యాదగిరి,మీసాల సుధాకర్ రావు,బంటు బలరాం,ప్రమోద్,ప్రీతం, వినయ్, సుభాష్ జాదవ్, మెయిన్, సలీం,ముశ్షు పటేల్ మరియు తదితరులు పాల్గొన్నారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >