Posted on 2023-12-30 05:41:47
డైలీ భారత్, హైదరాబాద్ : వారిద్దరూ ఫ్రెండ్స్. మద్యం తాగడం, గంజాయి పీల్చడం వారి హాబీ.. తరచూ గొడవలు పడుతుంటారు..
ఈ క్రమంలోనే నిన్న సాయం త్రం వారి మధ్య మళ్లీ వివా దం మొదలైంది.. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు.. అక్కడ ఘర్షణ పడ్డారు.. ఇదే క్రమంలో రైలు దూసు కొచ్చింది.. దీంతో ట్రైన్ ఢికొని.. వారిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు.
ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్లో కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయం లో ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటన తర్వాత మరి కొంతమంది అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవాని నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి.. వివరాలు సేకరించారు.
రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృత దేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
ఆదరించి ఆదుకోండి.. మా బాబుని బ్రతికించండి.. కథనానికి స్పందించిన SP నరసింహ IPS
Posted On 2026-04-01 12:33:53
Readmore >
FASTag : హైవే ప్రయాణికులకు షాక్..ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ ధరలు పెంపు
Posted On 2026-04-01 07:56:39
Readmore >
ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో "కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ " పై సర్టిఫికెట్ కోర్స్ ముగింపు సమావేశం
Posted On 2026-04-01 05:45:44
Readmore >
మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-31 11:28:48
Readmore >