| Daily భారత్
Logo




జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం విప్ ఆది శ్రీనివాస్

News

Posted on 2023-12-29 12:44:38

Share: Share


జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల జర్నలిస్టులకు ఆరు మాసాల్లో ఇండ్ల పట్టాలు నిర్మాణాలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పాటుపడుతామని,  పట్టాలు రాని జర్నలిస్టులకు పట్టాలు ఇప్పించడంతోపాటు జర్నలిస్టులు అందరికీ ఇండ్ల నిర్మాణానికి ఆరు మాసాలలోపు పరిష్కరించడం జరుగుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి లను ప్రెస్ క్లబ్ పాలకవర్గం, సభ్యులు శాలువాతో సత్కరించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చామని గుర్తుచేశారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి స్థలాలతో పాటు ఇండ్లను కూడా ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్, ప్రధాన కార్యదర్శి పరకాల ప్రవీణ్ కుమార్, రఘు రాపెళ్లి భాస్కర్ కాయితి మహేందర్ సీనియర్ జర్నలిస్టులు కరుణాల భద్రాచలం, తడుక విశ్వనాథం టివి నారాయణ, రాపెళ్లి సంతోష్ కుమార్, ఊరడి మల్లికార్జున్ రాచ లక్ష్మణ్ మిట్టపల్లి కాశీనాథ్ కాంబోజి ముత్యం మేడి కిషన్ ప్రెస్ క్లబ్ పాలకవర్గం సభ్యులు అల్లే రమేష్ నాయిని బాబు రాజా రమేష్ ఆన్సర్ అలీ దయానంద్ శిరీష నాలుగు పాల్గొన్నారు.

Image 1

ప్రపంచంలోనే మొట్ట మొదటి స్పోర్ట్స్ హ్యాకథన్ క్రీడాల్లో విజయం సాధించిన కామారెడ్డి జిల్లా క్రీడా కారులను అభినందించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-04-01 14:26:38

Readmore >
Image 1

కామారెడ్డిలో కొత్త సిఐ బాధ్యతలు

Posted On 2026-04-01 14:24:00

Readmore >
Image 1

లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ కృషి

Posted On 2026-04-01 14:23:00

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఏఎస్ఐ

Posted On 2026-04-01 14:03:43

Readmore >
Image 1

రక్తదాన శిబిరం తో ఆదర్శంగా నిలిచిన ధర్మారావుపేట గ్రామం

Posted On 2026-04-01 13:22:44

Readmore >
Image 1

ఏఎస్పీ, కామారెడ్డి కార్యాలయంలో నూతన ఛాంబర్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-01 13:21:20

Readmore >
Image 1

వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు చర్యలు : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-01 12:55:54

Readmore >
Image 1

సిరిసిల్ల : రవాణా శాఖ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు

Posted On 2026-04-01 12:52:15

Readmore >
Image 1

ఆదరించి ఆదుకోండి.. మా బాబుని బ్రతికించండి.. కథనానికి స్పందించిన SP నరసింహ IPS

Posted On 2026-04-01 12:33:53

Readmore >
Image 1

“మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?”

Posted On 2026-04-01 10:11:18

Readmore >