Posted on 2025-09-14 21:05:00
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం భగవాన్దాస్ కాలనీ మరియు గోల్డ్ స్మిత్ కాలనీల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భగవాన్ దాస్ కాలనీలోని కుంజా ధర్మ ఇంటి వద్ద ఈ నెల సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 4 వరకు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరగనున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భజనలు, శోభాయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు, కాలనీవాసులు కుటుంబ సమేతంగా హాజరై దుర్గామాత ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మికత, ఐక్యత, భక్తి భావనలను పెంపొందించేలా ఉంటాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కుంజా ధర్మా, భూక్యా రంగా,మూడా హరినాథ్, ఎస్కే సిరాజ్, నాగేశ్వరరావు, సుదర్శన్, రామాచారి, సున్నం భూలక్ష్మి, తెల్లం సునీత, స్వరూప, సుశీల, లీలావతి, ప్రియాంక, రమణమ్మ, క్రిష్ణప్రియ, భక్తులు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >