Posted on 2025-09-14 21:05:00
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం భగవాన్దాస్ కాలనీ మరియు గోల్డ్ స్మిత్ కాలనీల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భగవాన్ దాస్ కాలనీలోని కుంజా ధర్మ ఇంటి వద్ద ఈ నెల సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 4 వరకు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరగనున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భజనలు, శోభాయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు, కాలనీవాసులు కుటుంబ సమేతంగా హాజరై దుర్గామాత ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మికత, ఐక్యత, భక్తి భావనలను పెంపొందించేలా ఉంటాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కుంజా ధర్మా, భూక్యా రంగా,మూడా హరినాథ్, ఎస్కే సిరాజ్, నాగేశ్వరరావు, సుదర్శన్, రామాచారి, సున్నం భూలక్ష్మి, తెల్లం సునీత, స్వరూప, సుశీల, లీలావతి, ప్రియాంక, రమణమ్మ, క్రిష్ణప్రియ, భక్తులు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >