Posted on 2025-09-13 13:19:11
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ
కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ మాజీ ఛైర్మన్,మాజీ ఎంపీపీ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్బాసాని శంకర్ గౌడ్,మర్రిమడ్ల తాజా మాజీ సర్పంచ్ మాట్ల అశోక్,కొలనూరు ఫ్యాక్స్ డైరెక్టర్ ఇప్ప రాములు, మాజీ వార్డు సభ్యులు శంకరవ్వ, బొడ్డు కిషన్ సుమారు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.. వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు
వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిందని తెలిపారు..బిఆర్ఎస్ పార్టీలో దొరల పాలనలో తమకు సరైన గుర్తింపు లేదని, బీసీ బిడ్డ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనిచేస్తామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని తెలిపారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >