Posted on 2025-09-12 15:14:16
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
డైలీ భారత్, తంగళ్ళపల్లి:సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు రిజిస్టర్, అన్ని వార్డులు, మందుల గదిలో పరిశీలించారు. ప్రతి రోజూ ఆసుపత్రికి వైద్యం కోసం ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులతో వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో అందించే సేవలపై అవగాహన కల్పించాలని, ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >