Posted on 2025-09-12 15:05:51
కోనరావుపేట మండలంలో యూరియా పంపిణీ కేంద్రాల పరిశీలన
డైలీ భారత్, కోనరావుపేట: యూరియా కోసం వచ్చే రైతులు తమ వెంట తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ తీసుకురావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, సుద్దాల గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో శుక్రవారం రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, కలెక్టర్ పరిశీలించారు.
మండలానికి మొత్తం ఎన్ని బస్తాల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ను అడిగి తెలుసుకోగా, మొత్తం 1500 బస్తాలు వచ్చిందని కలెక్టర్ దృష్టికి డీఏఓ తీసుకువెళ్ళారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఎరువులు వినియోగించాలని సూచించారు. అవసరం ఉన్న మేరకే తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, మండల వ్యవసాయ అధికారులు తదితరులు ఉన్నారు.
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >