Posted on 2025-09-11 17:25:00
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు పంచాయతీ కార్మికులు మృతి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్ మండలం బెక్ నెల్లి గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ రాంపూర్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను తీసుకు వస్తుండగా కల్దుర్కి - సిద్ధాపూర్ మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో విద్యుత్ స్తంభాలు గ్రామ పంచాయతీ సిబ్బంది మీదపడగా, వారు అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. మృతులు విధుల నిర్వహణలో భాగంగా ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు వెలుగులోకి త్వరలో రానున్నాయి. అధికారుల నిర్లక్ష్యమేనా లేదా యంత్రాంగ వైఫల్యమా అన్న దానిపై విచారణ జరగాల్సి ఉంది.
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >