Posted on 2025-09-09 12:22:56
ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన స్పందించని ఎక్సైజ్ అధికారులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇటీవల ఎంతో ఆర్భాటంగా నగర శివారులోని ముబారక్ నగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ ప్రధాన రహదారి పక్కన ప్రారంభమైన అమృత్ బార్ & రెస్టారెంట్ ఎక్సైజ్ అధికారుల నియమాలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారని గతంలో స్థానికులు ఆ బార్ అండ్ రెస్టారెంట్ పై స్థానికులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించాల్సిన ఎక్సైజ్ అధికారులు అన్ని సవ్యంగా ఉన్నాయంటూ పలు అనుమానాలకు తెరలేపుతుంది. సంబంధించిన భార్ యజమాని ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కావడంతో అధికారులు ఫిర్యాదులపై స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ భార్ తో స్థానికులకు దుర్వాసన వెదజల్ల దంతో పాటు వ్యర్ధాలను గృహాల ప్రాంతాల్లో పారవేస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆ బార్ వద్ద ప్రతిరోజు మందుబాబులు న్యూసెన్స్ చేస్తున్నప్పటికీ పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. దీనిపై ఎక్సైజ్ అధికారులను వివరణ కోరగా, నిబంధనలకు అనుగుణంగానే బార్ ఏర్పాటు చేశారని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే ఎక్సైజ్ అధికారులు ఇచ్చిన వివరణ ప్రకారం అక్కడి పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. సమీపంలోని బార్కు సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలల తో పాటు ఓ మందిరం ఉన్నట్లు స్థానికులు కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మందు ఈ బార్ లో ఆ పరిసరాల్లోనే ప్రైవేట్ పాఠశాలలు ఉండడం అందులో విద్యార్థులు చదువు కోసం వస్తూ ఉంటారు. ఒకవేళ మద్యం తాగిన వారు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో ఎక్సైజ్ అధికారులు చెప్పాలి.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >