Posted on 2025-09-09 10:37:59
మేనల్లుడితో కలిసి భర్తను చంపి ఇంటి వెనకాల పాతిపెట్టిన భార్య
డైలీ భారత్, కాన్పూర్: ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో మరో ఘోరం జరిగింది. 20ఏళ్ల మేనల్లుడితో 45ఏళ్ల అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను గట్టిగా మందలించాడు. దీంతో భర్త అచూకీ లేకుండా చేయాలని మేనల్లుడితో స్కెచ్ వేసి అతన్ని చంపి ఇంటి వెనకాల పాతిపెట్టింది భార్య. దాదాపు పదినెలల తరువాత ఈ వ్యవహారం భయటపడింది. తాజాగా ఆ శవాన్ని పోలీసులు బయటకు తీశారు. సచేండిలోని లాలూపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
శివవీర్ సింగ్(50), లక్షి(45) దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. మేనల్లుడు అమిత్సింగ్(20)తో లక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతని హత్యకు అల్లుడితో కలిసి స్కెచ్ వేసింది లక్ష్మి. టీలో మత్తుమందు కలిపి ఇచ్చింది. ఆ తరువాత బతికే ఉంటాడాన్న అనుమానంతో ఇనుపరాడ్డుతో కొట్టి కొట్టి హత్యకు పాల్పడింది. అనంతరం భర్త శవాన్ని ఇంటి వెనకాలే గొయ్యి తవ్వి ప్రియుడి సహయంతో పాతిపెట్టి్ంది. త్వరగా శవం కుళ్లిపోయేలా గొయ్యిలో 10 కిలోల ఉప్పు పోసింది.
శివవీర్ సింగ్ కనిపించకుండా పోవడంతో పనికోసం గుజరాత్ వెళ్లాడని పొరుగువారిని, కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే చాలాకాలంగా అతను కనిపించకుండా పోవడం, అతని ఫోన్ కలవకపోవడం వంటివి కుటుంబ సభ్యులకు అనుమానాలు కలిగించాయి. దీంతో అతని తల్లి సావిత్రి దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో లక్ష్మి మేనల్లుడు అమిత్ సింగ్తో ఆమెకు సంబంధం ఉందని తెలుసుకున్న పోలీసులు వారిని తమదైన శైలిలో విచారించగా తామే ఈ నేరం చేసినట్లుగా అంగీకరించారు. బాధితుడి వ్యక్తిగత వస్తువులు చొక్కా, లాకెట్ ద్వారా అతన్ని గుర్తించామని అదనపు డీసీపీ తెలిపారు.ఇంటి వెనుక ప్రాంగణంలో అస్థిపంజర అవశేషాలు లభ్యం అయ్యాయి. సెప్టెంబర్ 7న లక్ష్మి, అమిత్లను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >