Posted on 2025-09-08 20:39:39
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆర్టీసీ బస్ ఢీకొని యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నగరంలోని కంఠేశ్వర్-రైల్వే కమాన్ వద్ద చోటుచేసుకుంది. ఘటనపై స్థానిక మూడవ టౌన్ ఎస్ఐ హరీష్ బాబు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని విక్లీ బజార్ కు చెందిన సంతోష్ (36) సంవత్సరాల యువకుడు తన బైక్ పై నిజామాబాద్ నగరం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందుగా వెలుతున్న కార్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో దాని వెనుక ఉన్న ప్రైవేట్ స్కూల్ బస్ ను వెనుకనుంచి సంతోష్ ఢీకొట్టాడు. దీంతో యువకుడు ప్రయాణిస్తున్న బైక్ ను ఎదురుగా నుండి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని 108 అంబులేన్స్ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలపడం జరిగిందని పోలీసులు వివరించారు. సంతోష్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాసి కాగా నగరంలో టైల్స్ పనిచేస్తు జీవిస్తున్నట్టు తెలిసింది. మూడవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >