Posted on 2025-09-08 14:58:29
సీఈసీ విద్యార్థులకు పాఠాల బోధన
తరగతి గదులు, కిచెన్ లో పరిశీలన
ఆవరణ అంతా శుభ్రం చేయించాలని ఆదేశాలు
డైలీ భారత్, తంగళ్ళపల్లి: తంగళ్ళపల్లి మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, బోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ వినియోగంలో ఉందా? లేదా అని ఆరా తీశారు.
అన్ని తరగతి గదుల్లో బోధన కొనసాగుతుండగా, పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. సీఈసీ విద్యార్థులకు ఎకనామిక్స్ పాఠాలు బోధించి, పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యాలయం ఆవరణలో గడ్డి, ఇతర వ్యర్థాలు వెంటనే తొలగించాలని
పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >