| Daily భారత్
Logo




తల్లి కూతురు ఆత్మహత్య?

News

Posted on 2023-12-27 06:45:15

Share: Share


తల్లి కూతురు ఆత్మహత్య?

డైలీ భారత్, మంచిర్యాల జిల్లా: మందమర్రిలో తల్లి కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్- ధనలక్ష్మి దంపతులు ఇక్కడ పాపుడాలు, చెకోడీలు తయారు చేసి విక్రయిస్తూ.. జీవనం సాగిస్తున్నారు. పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లగా..

మంగళవారం అర్థరాత్రి.. ధనలక్ష్మి (36), ఆమె కూతురు జీవని (16) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ధనలక్ష్మి కొడుకు సిద్ధు..ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నా గమనించలేదు. ఉదయం లేచి చూసేసరికి.. తన తల్లి, సోదరి ఉరికి వేలాడుతూ కనిపించడంతో ఖంగుతిని.. సొమ్మసిల్లి పడిపోయాడు.

తేరుకున్నాక బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపారం ముగించుకున్నాక ఇంటికి తిరిగొచ్చే మురుగున్.. ఇంతవరకూ ఇంటికి రాకపోగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.

దాంతో అతనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధనలక్ష్మి, జీవని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

వీరిద్దరిదీ ఆత్మహత్యేనా..? లేక మురుగన్ ఏమైనా చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

స్వలాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు

Posted On 2026-04-02 14:57:47

Readmore >
Image 1

గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు

Posted On 2026-04-02 14:47:44

Readmore >
Image 1

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్

Posted On 2026-04-02 14:43:45

Readmore >
Image 1

హనుమాన్ ర్యాలీ సందర్భంగా మజ్జిగ పంపిణీ

Posted On 2026-04-02 13:46:06

Readmore >
Image 1

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఆవేదన

Posted On 2026-04-02 13:44:47

Readmore >
Image 1

వేములవాడ తిప్పాపురం గోశాలలో ఆకస్మిక తనిఖీలు

Posted On 2026-04-02 13:39:34

Readmore >
Image 1

ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా అమరవాది

Posted On 2026-04-02 12:04:26

Readmore >
Image 1

రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ

Posted On 2026-04-02 11:35:51

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా గ్రామసభ

Posted On 2026-04-02 11:29:23

Readmore >
Image 1

నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ

Posted On 2026-04-02 07:41:02

Readmore >